Wednesday, May 1, 2024

Breaking: టెంపుల్ లో చోరీకి య‌త్నించిన దొంగ మృతి

హైదరాబాద్‌ కుషాయిగూడలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీకి య‌త్నించిన దొంగ మృతిచెందాడు. చోరీ కోసం వచ్చిన దొంగను అడ్డుకునే క్రమంలో జరిగిన పెనుగులాటలో అతను చనిపోయినట్లు వాచ్‌మెన్‌ రంగయ్య తెలిపాడు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలోకి రాత్రి సమయంలో ఓ వ్యక్తి దొంగతనానికి యత్నించాడు. హుండీ, ఓ ప్రతిమను ఎత్తుకుని వెళ్లడం గమనించిన వాచ్‌మెన్‌ అతన్ని అడ్డుకున్నాడు. దీంతో అతను వాచ్‌మెన్‌పై రాళ్లతో దాడికి దిగాడు. దొంగను అడ్డుకునే క్ర‌మంలో వాచ్ మెన్ కు దొంగ‌కు జరిగిన పెనుగులాటలో దొంగ తలకు బలంగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అధికారులు, పోలీసులు మృతదేహం చూసి భయాందోళనకు గురయ్యారు. వాచ్‌మెన్ రంగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement