Sunday, May 5, 2024

KHM: విద్యార్థులను వేధించిన కీచక ఉపాధ్యాయుడు.. పీఎస్ లో తల్లిదండ్రుల ఫిర్యాదు

అశ్వారావుపేట, అక్టోబర్30 (ప్రభ న్యూస్): అభం శుభం తెలియని చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉన్నత శిఖరాలకు చేర్పించాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడుగా మారి విద్యార్థుల నే వేధించిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఓట్లపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న బోడ మోహన్ రావు అనే ఉపాధ్యాయుడు శనివారం తన తరగతి గదిలోని పలువురు విద్యార్థిని విద్యార్థులను ఒకరితో ఒకరిని బట్టలు విప్పదీయించి వీడియోలు తీపించారు. అలాగే తరగతి గదిలోని మూత్రశాలను కూడా శుభ్రం చేయించారు.

ఈ విషయమై విద్యార్థులు సాయంత్రం ఇంటికి చేరిన తర్వాత తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారు. దీంతో ఆదివారం సెలవు దినం కావడంతో సోమవారం ఉదయం విద్యార్థుల తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో సదరు ఉపాధ్యాయుడు పై ఫిర్యాదు చేశారు. సంఘటనపై ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా సంఘటనకు బాధ్యుడైన ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement