Thursday, May 2, 2024

MP: ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి… దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన గవర్నర్

హైదరాబాద్ : సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్‌ మండలం సూరంపల్లిలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై జరిగిన కత్తి దాడి ఘటనపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ ఘటనపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభాకర్ రెడ్డి త్వరగా కొలుకోవాలన్నారు.

ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు. ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్య ప్రక్రియకే ప్రమాదకరం. ఎన్నికల సమయంలో పోటీలో ఉన్న అభ్యర్థులు, ప్రచారం చేసే వారి భద్రత కోసం తగిన చర్యలు తీసుకోవాలి’’ అని గవర్నర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement