Sunday, May 19, 2024

ప్రమాదకర స్థాయిలోనే కరోనా వ్యాప్తి.. తాజాగా 992 కేసులు నమోదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కరోనా ఉధృతి ప్రమాదకరస్థాయిలో కొనసాగుతూనే ఉంది. వరుసగా రెండో రోజూ దాదాపు 1000 కరోనా కేసులు నమోదవడం అటు వైద్య, ఆరోగ్యశాఖలో ఇటు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. బుధవారం సాయంత్రం 5.30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41, 182 మందికి కరోనా టెస్టులు చేయగా… 992కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులను కలుపుకుంటే తెలంగాణలో ఇప్పటి వరకు నమోదై న మొత్తం కరోనా కేసుల సంఖ్య 8, 22, 663కు చేరింది. కరోనా నుంచి కోలుకోవడంతో 852 మంది వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ వ్యాప్తి రోజు రోజుకూ పెరుగుతుండడంతో రాష్ట్రంలో కరోనా యాక్టివ్‌ కేసుల సంఖ్య ప్రమాదకరస్థాయిలో పెరుగుతోంది.

కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న వారి సంఖ్య ఇప్పుడు తెలంగాణలో 6వేలను దాటింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6132 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వీరిలో 98శాతం మంది హోం ఐసోలేషన్‌ చికిత్సతతోనే కోలుకుంటున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో వైద్య, ఆరోగ్యశాఖ కరోనా టెస్టుల సంఖ్యను పెంచింది. ప్రస్తుతం ప్రతీ రోజూ 40వేల టెస్టులు చేస్తున్నారు. తాజాగా 41, 182 మందికి కరోనా టెస్టులు చేశారు. జీహెచ్‌ఎంసీలో ప్రమాదకరస్థాయిలో వ్యాప్తి… తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ ప్రాంతంలో 376, కరీంనగర్‌లో 57, ఖమ్మంలో 32, మంచిర్యాలలో 21, మేడ్చల్‌ మల్కాజిగిరి 54, నల్గొండ 37, నిజామాబాద్‌ 37, పెద్దపల్లిలో 26, రాజన్న సిరిసిల్లలో 20, రంగారెడ్డిలో 65, సంగారెడ్డిలో 19, సిద్ధిపేటలో 18, హన్మకొండలో 287, యాదాద్రి భువనగిరిలో 32 అత్యధిక కేసులు నమోదయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement