Monday, April 29, 2024

మానవ మనుగడలో వైద్యుల పాత్ర మరులేనిది.. ఎంపీ సంతోష్‌ కుమార్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మానవ మనుగడలో వైద్యుల పాత్ర మరువలేనిదని గ్రీన్‌ ఇండియా రూపకర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ అన్నారు. నేషనల్‌ డాక్టర్స్‌ డే సందర్భంగా వైద్యులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏ స్వార్థం లేకుండా సకల జీవకోటికి ప్రాణవాయువు అందించే మొక్కలా వైద్యులు కూడా నిస్వార్థంగా సేవ చేస్తున్నారని ఆయన కొనియాడారు.

సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతుల్లో వైద్యులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. నేషనల్‌ డాక్టర్‌ డే సందర్భంగా వైద్యులు మొక్కలను నాటి సమాజానికి గ్రీన్‌ మెస్సేజ్‌ ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement