Monday, April 29, 2024

Bigg Boss: బిగ్‌బాస్ షో గొడ‌వ‌పై… కేసు న‌మోదు చేసిన పోలీసులు

బిగ్‌బాస్‌ సీజన్ -7 హౌస్‌లోనే కాదు… బిగ్‌బాస్‌ బయట కూడా రచ్చరచ్చ జరిగింది. బిగ్‌బాస్‌ హౌస్‌లో కంటెస్టెంట్లు పోట్లాడుకుంటే… హౌస్‌ బయట వాళ్ల ఫ్యాన్స్‌ అంతకంటే ఎక్కువ హంగామా చేశారు. తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ -7 విజేతను ప్రకటించగానే నడిరోడ్డుపై కొట్టుకున్నారు పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌. అన్నపూర్ణ స్టూడియోస్‌ దగ్గర ఈ రచ్చ జరిగింది. ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ బూతులతో రెచ్చిపోయాయి ఇరువర్గాలు.

పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ అభిమానులు పరస్పరం కొట్టుకోవడమే కాదు… అటువైపు వెళ్లే వాహనాలపైనా దాడికి దిగారు. బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ దాడిలో ఆర్టీసీ బస్సుతోపాటు పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. వీళ్లను కంట్రోల్‌ చేయడానికి పెద్దఎత్తున పోలీసుల్ని రంగంలోకి దింపాల్సి వచ్చింది. లాఠీఛార్జ్ కూడా చేశారు. ఈ ఘర్షణ ఇన్సిడెంట్‌ను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు… పల్లవి ప్రశాంత్‌, అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌పై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలపై దాడులకు పాల్పడిన అభిమానులపై కేసులు నమోదు చేశారు. దాడులకు పాల్పడిన అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.

బిగ్‌బాస్‌ సీజన్‌-7 టైటిల్‌ను యూట్యూబర్‌, రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ దక్కించుకున్నాడు. రన్నరప్‌గా సీరియల్‌ నటుడు అమర్‌దీప్‌ నిలిచాడు. అయితే, రన్నరప్‌గా నిలిచిన అమర్‌దీప్‌ కారుపై మొదట దాడి జరిగినట్టు తెలుస్తోంది. హౌస్‌లో ఉన్నప్పుడు అమర్‌దీప్‌, పల్లవి ప్రసాద్‌ మధ్య జరిగిన కొన్ని సంఘటనలే ఈ ఉద్రిక్తతలకు కారణంగా తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement