Sunday, May 19, 2024

TS | ఈనెల 30న హైకోర్టుకు సెలవు.. ఎన్నికల నేపథ్యంలో నిర్ణయం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఈనెల 30న రాష్ట్ర శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైకోర్టుకు సాధారణ సెలవును ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టుతోపాటు జిల్లా జ్యూడీషియరీకి సెలవు దినంగా ప్రకటించారు. ఇందుకు బదులుగా డిసెంబర్‌ 16న శనివారంనాడు న్యాయస్థానాలు పనిచేస్తాయని రిజిస్ట్రార్‌ జనరల్‌ వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement