Monday, April 29, 2024

TS: విద్యార్థినుల ఆత్మహత్యలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించాలి… ఎమ్మెల్సీ కవిత

రాష్ట్రంలో విద్యార్థినుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని, ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని.. తక్షణమే సమీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లాలోని మోతె మండలం బురకచర్లలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న గురుకుల పాఠశాల విద్యార్థిని అస్మిత కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. ఈసందర్భంగా అస్మితకు నివాళులర్పించి, కుటుంబానికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటి వరకు విద్యాశాఖ, సాంఘీక సంక్షేమ శాఖకు మంత్రి లేరన్నారు.

హాస్టళ్లలో పర్యవేక్షణ లోపం కనిపిస్తుందన్నారు. ప్రతి హాస్టల్ లో ఫ్రెండ్లీ నేచర్ కల్పించాలన్నారు. ప్రతి హాస్టల్ లో సైకాలజిస్ట్ లను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో మనోధైర్యాన్ని కల్పించాలన్నారు. ఎలాంటి ఒత్తిడినైనా తట్టుకునేలా విద్యార్థులను తయారు చేయాలన్నారు. అస్మిత కుటుంభానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.

తల్లిదండ్రులు కూడా పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి పెట్టవద్దని.. ఆత్మహత్యలపై ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే సమీక్ష నిర్వహించి ఆత్మహత్యల నివారణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement