Monday, April 29, 2024

AP: పేదింటి ఆడపిల్లలకు ఆర్థిక పెన్నిధి కళ్యాణమస్తు, షాదీ తోఫా….కలెక్టర్ వి.విజయ్ రామరాజు

కడపప్రతినిధి, ఫిబ్రవరి 20 (ప్రభ న్యూస్) : వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం.. పేదింటి ఆడపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం అందించే అపురూపమైన ఆర్థిక పెన్నిధి.. అని జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అన్నారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం 5వ విడత ఆర్థిక సాయాన్ని కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసి హాలు నుండి కడప జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజుతో పాటు.. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, డిఆర్వో గంగాధర్ గౌడ్, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతిలు హాజరయ్యారు.

- Advertisement -

ఈ పథకానికి సంబంధించి వైఎస్ఆర్ జిల్లాలో వివాహం చేసుకున్న అర్హులైన 530 జంటలకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 4,32,35,000 లను మెగా చెక్కు రూపంలో జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు అతిధులతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు, చదువును ప్రోత్సహించడం కోసం పదో తరగతి నిబంధనను అమలు చేస్తూ.. ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టిందన్నారు. ఏడాదిలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకానికి సంబంధించి అర్హులను ఎంపిక చేసి.. లబ్ధిదారులకు కళ్యాణమస్తు, షాదీ తోఫాలను పెళ్లినకుమార్తె తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.

అరులైన వారు పెళ్లి అయిన 60 రోజుల్లోపు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం అధికారులు దరఖాస్తులను పరిశీలించి.. క్షేత్రస్థాయిలోనూ విచారించి అర్హుల జాబితాను ప్రకటిస్తారన్నారు. అలాగే, రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పి. రామసుబ్బా రెడ్డి, డి ఆర్ ఓ గంగాధర్ గౌడ్, సాంఘిక సంక్షేమ శాఖ, డీఆర్డీఏ, మెప్మా, వివిధ సంక్షేమ శాఖల అధికారులు, లబ్ది పొందిన వధూవరులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement