Friday, May 3, 2024

షూటింగ్ ను అడ్డుకున్న.. అటవీశాఖ అధికారులు

వికారాబాద్ ( ప్రభ న్యూస్) : అనంతగిరిలో అనుమతులు లేకుండా షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చేస్తున్న వారి వద్ద నుండి డ్రోన్ కెమెరాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా అటవీశాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలు ఎగరవేయడంతో డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారుఎ ఫారెస్ట్ అధికారులు. ఫారెస్ట్ అధికారులతో మూవీ నిర్వాహకులు వాగ్వాదం చేయగా సంఘటన స్థలానికి వెళ్లిన అటవీ శాఖ అధికారి అరుణ అక్కడ డ్రోన్ కెమెరాలను.. నిర్వాహకులను.. జిల్లా అటవీశాఖ కార్యాలయానికి రప్పించారు. ఈ విషయమై జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ అనుమతి లేకుండా డ్రోన్ కెమెరాలతో ఎవరు షూటింగ్ నిర్వహించిన కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement