Tuesday, May 7, 2024

తండ్రికి తలకొరివి పెట్టిన తనయ.. క‌న్నీరుమున్నీరైన గ్రామ‌స్తులు

నెల్లికుదురు (ప్రభ న్యూస్): కన్న కొడుకులు లేకపోవడంతో కూతురు తండ్రికి తలకొరివి పెడుతున్న దృశ్యం చూస్తూ పలువురు కంటతడి పెట్టారు. మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన కావటి యాకయ్య (45) కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చ‌నిపోయాడు.

మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి ఇద్దరు కూతుర్లున్నారు. కాగా, పెద్ద కూతురు తలకొరివి పెట్ట‌డంతో గ్రామస్తులు, బంధువులు కన్నీటిపర్యంతమయ్యారు. అంత్యక్రియల్లో మృతుడి బామ్మర్ది ఆకుల మల్లేష్ కు చెందిన స్నేహితులు, సర్పంచ్ బోడిగం సోమేశ్వరి చంద్రారెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేష్, టిఆర్ఎస్ మండల పార్టీ ప్రచార కార్యదర్శి దాసరి ప్రకాశ్, సీనియర్ నాయకులు చిర శ్రీనివాస్, శ్రీశైలము, వెంకట సాయి లు, బత్తిని అజయ్ , ఓరుదోలు యాకన్నా, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement