Monday, April 29, 2024

TS: ప్రశాంత్ రెడ్డి తల్లి దినకర్మలో పాల్గొన్న సభాపతి పోచారం దంపతులు

బాన్సువాడ, అక్టోబర్ 24 (ప్రభ న్యూస్) : మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి దినకర్మలో మంగళవారం సభాపతి పోచారం దంపతులు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూరులో రాష్ట్ర ఆర్ అండ్ బి శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తల్లి స్వర్గీయ వేముల మంజులమ్మ ద్వాదశ దినకర్మకు తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి, భార్య పోచారం పుష్ప పాల్గొన్నారు.


ఈసందర్భంగా స్వర్గీయ వేముల మంజులమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని, కుటుంబ సభ్యులను సభాపతి పోచారం దంపతులు పరామర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement