Sunday, May 5, 2024

గోదావ‌రిలో గ‌ల్లంతైన బాలుడు సాయివర్ధన్​ మృత‌దేహం ల‌భ్యం..

తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా ఏటూరు నాగారం వ‌ద్ద గోదావరిలో ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. పండుగ‌వేళ అంతా సంబురంగా ఉంటే.. ఈ పిల్ల‌లు మాత్రం ఈత‌కోసం గోదావ‌రి న‌దిలోకి వెళ్లారు. అయితే ఈత‌కొడుతుండ‌గా నీట‌మునిగి ముగ్గురు బాలురు క‌నిపించ‌కుండా పోయారు. గల్లంతైన వారిని నితీష్ (17), సాయివర్ధన్ (17), సందీప్ (12) గా గుర్తించారు. వారికోసం ముమ్మ‌రంగా గాలింపు చర్యలు చేప‌ట్టారు. మ‌ధ్యాహ్నం నుంచి చేప‌ట్టిన గాలింపు చ‌ర్య‌ల్లో భాగంగా సాయివ‌ర్ధ‌న్ అనే బాలుడి మృత‌దేహం జాల‌రుల‌కు ల‌భించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement