Wednesday, May 1, 2024

అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయం.. ప్రభుత్వ విప్ బాల్క సుమన్

అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 1000 మంది నిరుపేద క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ క్రిస్మస్ వేడుకలను క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని పిలుపునిచ్చారు.

భూపాలప‌ల్లి జిల్లాలో..
జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ దగ్గరలో చర్చి నందు ప్రభుత్వం తరఫున క్రిస్టమస్ సోదరులకు బట్టల గిఫ్ట్ ప్యాక్లను స్థానిక శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి, జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా సంబంధిత ప్రజాప్రతినిధులు అందజేశారు.

భూపాలపల్లిలో బట్టలు అందజేస్తున్న ఎమ్మెల్యే, కలెక్టర్
Advertisement

తాజా వార్తలు

Advertisement