Monday, May 6, 2024

TS | కౌలు రైతు ఆత్మహత్య.. జ‌య‌శంక‌ర్ జిల్లాలో ఘ‌ట‌న‌

చిట్యాల, (ప్రభ న్యూస్): జయశంకర్ జిల్లాలో కౌలు రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. చిట్యాల మండలం గిద్దె ముత్తారం గ్రామానికి చెందిన వేముల రాజేషం (48 అప్పుల బాధ భరించలేక శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. గిద్దె ముత్తారం గ్రామానికి చెందిన రాజేశం మూడు ఎకరాలు కౌలు, తండ్రికి చెందిన ఎకరం వ్యవసాయ భూమిలో పత్తి, మిర్చి పంట సాగు చేశాడు.

సుమారు రూ 5 లక్షల దాకా అప్పులు కాగా, మనస్తాపం చెందిన రాజేశం చేను వద్ద పురుగుల మందు తాగగా, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో తరలిస్తున్న క్రమంలో మృతి చెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. కౌలు రైతు రాజేష్ మృతితో కుటుంబంతోపాటు గిద్దెముత్తారం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామ ప్రజలు కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement