Wednesday, May 22, 2024

నేటితో ముగియ‌నున్న ఆల‌య ప్ర‌తిష్ఠాప‌ణోత్స‌వాలు..

నిజామాబాద్‌ జిల్లా నందిపేట్‌ మండలం చౌడమ్మ కొండూర్‌లో రాజ్యలక్ష్మీ సమేత నృసింహ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ప్రాతఃఆరాధనతో ప్రారంభమైన కార్యక్రమాలు.. సేవాకాలం, నివేదన, మంగళాశాసనము, శాత్తుమోరై, వేదవిన్నపాలు, ద్వార తోరణ ధ్వజకుంభ ఆరాధన, చతుఃస్థానార్చన, అగ్ని ముఖం, మూలమంత్రమూర్తి, మంత్ర హవనం, పంచసూక్త పరివార ప్రాయశ్చిత్త హవనము, మహా పూర్ణాహుతి, యాగశాల ఉద్వాసన, ప్రథమారాదనం, నివేదన, మంగళాశాసనము, వేద విన్నపాలు, శాత్తుమోరై, శాంతి కల్యాణం, మహదాశీర్వచనం, పండిత సన్మానం, ఉత్సవ సమాప్తి, స్వస్తితో ప్రతిష్ఠాపన వేడుకలు ముగుస్తాయి.

ఉదయం 7.56 గంటలకు హస్తా నక్షత్రయుక్త మిథున లగ్న పుష్కరాంశమున ప్రతిష్ఠామూర్తులకు మహాకుంభ సంప్రోక్షణ చేస్తారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ కవిత దంపతులు, స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ సంతోష్‌ కుమార్‌ పాల్గొంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement