Friday, May 3, 2024

NLG: తెలంగాణ ఏర్పడింది పేద ప్రజల కోసం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

సంస్థాన్ నారాయణపురం, జులై 31 (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రభుత్వం ఏర్పండిది పేద ప్రజల కోసమని కేసీఆర్ కుటుంబం కోసం కాదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. నారాయణపురం మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు హాజరై సంఘీభావం తెలిపి మాట్లాడారు.

తెలంగాణ ఏర్పడ్డాక నీళ్లు, నిధులు, నియామకాలు అందేలా చూస్తానన్న తెలంగాణ ప్రభుత్వం నేడు పేద ప్రజల, నిరుద్యోగుల పొట్ట కొడుతుందని విమర్శించారు. గ్రామపంచాయతీ కార్మికులు గత 26 రోజులుగా చేస్తున్న సమ్మె తెలంగాణ ప్రభుత్వానికి కనబడతలేదా అని హెచ్చరించారు. గ్రామపంచాతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement