Monday, April 29, 2024

ఆటా సంబురాల్లో తెలంగాణ టూరిజం హవా.. ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొంటున్నారు. దీనికి గాను కవిత నిన్న అమెరికా వెళ్లారు.. కాగా, ఆమెతో పాటు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ మహాసభలో తెలంగాణ టూరిజానికి సంబంధించిన స్టాళ్లను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఉన్న పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అమెరికా ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆట నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement