Saturday, May 4, 2024

తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వం.. జూన్ 2 నుంచి క్రికెట్‌ టోర్నీ ప్రారంభం..

జూన్‌ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రికెట్‌ టోర్నీ నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్‌ అల్లిపురం వెంకటేశ్వర్‌ రెడ్డి తెలిపారు. లాల్‌ బహుదుర్‌ స్టేడియంలో ఈ పోటీలు ఏర్పాటు చేస్తున్నామని, సే నో టూ డ్రగ్స్‌ నినాదంతో ఈ టోర్నీ నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. జూన్‌ 2న ప్రారంభమయ్యే టోర్నీ.. 2 రోజుల పాటు సాగుతుందన్నారు.

3వ తేదీన నిర్వహించే ఫైనల్స్‌లో గెలుపొందిన వారికి బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ టోర్నీకి సంబంధించిన బ్రోచర్‌ను రవీంద్ర భారతీలో క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు క్రీడాకారులు, అభిమానులు, నేతలు పాల్గొన్నారు

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement