Thursday, May 2, 2024

CM REVANTH: ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభ… లోక్ సభ ఎన్నికల శంఖారావాన్నిపూరించనున్న సీఎం

నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. కేస్లాపూర్ నాగోబా ఆలయంలో అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇంద్రవెల్లిలో తెలంగాణ పునర్నిర్మాణ సభలో ఎన్నికల శంఖారావాన్ని సీఎం రేవంత్ రెడ్డి పూరించనున్నారు.

ఇంద్రవెల్లి అమరవీరులకు నివాళులు అర్పించి, స్మృతి వనానికి శంకుస్థాపన చేయనున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. మొత్తంగా నేడు రూ.160కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి బహిరంగ సభ కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement