Monday, April 29, 2024

తెలంగాణలో భారీగా జిల్లా జడ్జిల బదిలీలు

తెలంగాణలో భారీగా జిల్లా న్యాయమూర్తులను బదిలీ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 45 మంది జిల్లా జడ్జిలను బదిలీ చేసింది. ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులను జారీ చేసింది. 14 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జిలకు జిల్లా జడ్జీలుగా తాత్కాలిక పదోన్నత కల్పించింది.

సైబరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు జడ్జిగా ఆర్.తిరుపతి, హైదరాబాద్ సిటీ స్మాల్ కాజెస్ కోర్టు చీఫ్ జడ్జిగా జీవీ సుబ్రమణ్యం, కరీంనగర్ ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జిగా ఎ.వీరయ్య నియమితులయ్యారు. సీనియర్ సివిల్ జడ్జిలు పి.రాజు, పి.లక్ష్మీ కుమారి, జి.సునీత రవీంద్రరెడ్డి, సి.పావని, ఎం.శరత్ కుమార్, ఎన్.రోజా రమణి, టి.అనిత, మహ్మద్ అఫ్రొజ్ అఖ్తర్, కె.ఉమాదేవి, బి.అపర్ణదేవి, సీహెచ్.పంచాక్షరి, బి.తిరుపతి, జె.కవిత, టి.సుహాసినిలకు జిల్లా జడ్జిలుగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ హైకోర్టు పోస్టింగులు ఇచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement