Friday, April 19, 2024

సర్పంచులకు షోకాజ్ నోటీసులు ఇచ్చిన కలెక్టర్

రాజ‌న్న‌ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్క‌ర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను వినియోగంలోకి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకున్నారు. ఆరు గ్రామాల సర్పంచ్ లకు షోకాజ్ నోటీసులు, ఓ పంచాయితీ కార్యదర్శికి మెమో జారీ చేస్తూ చేశారు.

రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండా గ్రామ సర్పంచ్ గుగులోత్ పెంటయ్య, వెంకటాపూర్ గ్రామ సర్పంచ్ కోల అంజవ్వ, బాకురుపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీరా మంజుల, వీర్నపల్లి మండలం జవహర్ లాల్ నాయక్ తండా గ్రామ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్, బావుసింగ్ నాయక్ తండా కళావతి, ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎలుక పద్మ లకు తమ గ్రామాల్లో నిర్మించిన వైకుంఠధామాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావడంలో విఫలమైనందుకు గాను కలెక్టర్ కృష్ణ భాస్క‌ర్‌ షోకాజ్ నోటీసులు జారీ చేశారు.

ఇది కూడా చదవండిః హుజురాబాద్ లో వారే న్యాయ నిర్ణేతలు!

Advertisement

తాజా వార్తలు

Advertisement