Monday, April 29, 2024

తెలంగాణ‌లో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటాం: హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు

రాష్ట్రంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొనేందుకు అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను ముందుగానే కొంటామ‌ని తెలంగాణ వైద్య ఆరోగ్య సంచాలకుడు జి.శ్రీనివాసరావు అన్నారు. నీలోఫ‌ర్ ఆసుప‌త్రిని నోడ‌ల్ కేంద్రంగా ఏర్పాటు చేశామ‌ని శ్రీనివాసరావు చెప్పారు. మూడో ద‌శకు అవ‌స‌ర‌మైన ఔష‌ధాల‌ను ముందుగానే కొనుగోలు చేస్తున్నామ‌ని చెప్పారు. మూడో ద‌శ గురించి సిబ్బందికి శిక్ష‌ణ ఇస్తామ‌ని, ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేస్తామ‌ని వివ‌రించారు.  

రాష్ట్రంలో క‌రోనా ప‌రీక్ష‌ల సామ‌ర్థ్యాన్ని పెంచుతున్నామ‌ని ఆయన తెలిపారు. మే 29న రాష్ట్రంలో ల‌క్ష క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. అలాగే, రెండో ద‌శ ఫీవ‌ర్ సర్వేలో 68.56 శాతం మందికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని చెప్పారు. ప్రైవేటు ఆసుప‌త్రుల్లో బిల్లులు, ఇత‌ర అంశాల‌పై వ‌చ్చిన ఫిర్యాదుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని శ్రీనివాసరావు తెలిపారు. ఫిర్యాదుల ప‌రిశీల‌న‌కు ముగ్గురు ఐఏఎస్‌ల‌తో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టికే 79 ఆసుప‌త్రుల‌కు నోటీసులు జారీ చేశామ‌ని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement