Sunday, April 28, 2024

స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయండి: జిల్లా క‌లెక్ట‌ర్లకు సీఎం ఆదేశం

తెలంగాణవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్.. అక్కడి నుంచే వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖ‌ల అధికారుల‌తో సీఎం స‌మీక్షించి ప‌లు సూచ‌న‌లు చేశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు ముమ్మ‌రం చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను పున‌రావాస కేంద్రాల‌కు త‌ర‌లించాల‌ని సూచించారు. అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండి, 24 గంట‌లూ అధికారులు అందుబాటులో ఉండాల‌ని ఆదేశించారు. భారీ వానల వల్ల వాగులు వంకలు పొంగిపొర్లుతున్న నేపథ్యంలో ఆయా గ్రామాలు మండలాల్లోని ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆయా శాఖల ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ , పట్టణ ప్రాంతాల్లో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు,నాళాలు తదితర రంగాల పరిస్థితుల పట్ల ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి మున్సిపల్ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రోడ్లు భవనాల శాఖ, విద్యుత్ శాఖల అధికారులు కింది స్థాయి వరకు తమ ఉద్యోగులను అప్రమత్తం చేయాలన్నారు.

వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ బలగాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చూసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి వారి నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం తో సమన్వయం చేసుకుంటూ తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎడతెగని వర్షాల నేపథ్యంలో తమ తమ నివాసాల నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయకుండా సురక్షితంగా ఉండాలని, వర్ష ప్రభావిత వరద ముంపు ప్రాంతాల ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు.

ఇది కూడా చదవండి: నిరుద్యోగ దీక్ష ప్రారంభించిన వైఎస్ ష‌ర్మిల

Advertisement

తాజా వార్తలు

Advertisement