Tuesday, April 30, 2024

Telangana – మరో 67 మంది డిఎస్పీలు బ‌దిలీ..

హైద‌రాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ‌లో పోస్టింగ్‌లు, బ‌దిలీలు కొన‌సాగుతున్న విష‌యం విదిత‌మే. తాజాగా డీఎస్పీల‌కు పోస్టింగ్‌లు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 67 మంది డీఎస్పీల‌కు పోస్టింగ్ లు ఇస్తూ డీజీపీ అంజ‌నీ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. కుల్సుంపుర ఏసీపీగా అబ్దుల్ జావిద్, మీర్ చైక్ ఏసీపీగా ఉమా మ‌హేశ్వ‌ర్ రావు, వ‌ర్ధ‌న్న‌పేట ఏసీపీగా వీ సురేశ్‌, వ‌రంగ‌ల్ సీసీఆర్బీ ఏసీపీగా గ‌జ్జి కృష్ణ‌, టీఎస్ జెన్‌కో ఏసీపీగా తిరుప‌తి యాద‌వ్, సీసీఎస్ ఏసీపీగా శంక‌ర్ రెడ్డిని నియ‌మించారు.

కాగా, ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో గత పదిహెను రోజులుగా పెద్ద ఎత్తున బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఒకే జిల్లాలో మూడేళ్ల పాటు పనిచేసిన డిఎస్పీలను, స్వంత జిల్లాలో పనిచేస్తున్న వారిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రోజు మరిన్ని బదిలీలు జరిగే అవకాశాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement