Sunday, May 5, 2024

సీపీఎం మహాసభలతో సంచలనం: తమ్మినేని

వామపక్షాల ఐక్యతకు సిపిఎం 3వ తెలంగాణ రాష్ట్ర మహా సభలు ప్రతిబింబిస్తాయాని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆశాభావం వ్యక్తం చేశారు. మహాసభలు సంచలనం సృష్టించ బోతుయన్నారు. బీజేపీ, టిఅర్ఎస్ పార్టీలు స్పష్టత ఇవ్వడం లేదని ఆరోపించారు. వచ్చే ఏడాది జనవరి 22 నుంచి 25 వరకూ నాలుగు రోజుల పాటు సిపిఎం 3వ రాష్ట్ర స్థాయిలో మహాసభలు నిర్వహించనున్నట్లు తమ్మినేని వీరభద్రం చెప్పారు. ఈ మహాసభలకు 700 మంది ప్రతినిధులు హాజరవుతుండగా, 300 వాలంటీర్లు సభా నిర్వహణలో పాల్గొంటారు. ఈ సమావేశాల్లో సిపిఎం జాతీయ నాయకులు సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్, బి.వి. రాఘవులు తదితరులు హాజరవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement