Monday, April 29, 2024

TS: సూర్యాపేట SBI మేనేజర్ ఘరానా మోసం..

తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట ఎస్‌బీఐలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఖాతాదారుల పేరిట భారీగా అక్రమ లోన్లు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. రూ.10కోట్ల వరకు మేనేజర్ సైదులు కొట్టేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో బాధితులు పోలీసులు ఆశ్రయిస్తున్నారు.

రామంతాపూర్ ఘటనతో సైదులు మోసాలు బయటపడ్డాయి. సూర్యాపేట, రామంతాపూర్‌లో ఎస్‌బీఐ బ్యాంకు మేనేజర్‌గా సైదులు విధులు నిర్వహించారు. రామంతాపూర్ ఎస్‌బీఐలో రూ.2.8 కోట్లను సైదులు కొట్టేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement