Tuesday, April 30, 2024

చైన్ స్నాచర్ ను పట్టించిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత

నర్సాపూర్, ఏప్రిల్ 22 (ప్రభ న్యూస్) : ఓ ఆటో డ్రైవర్ తన ఆటోలో కూర్చుని ప్రయాణిస్తున్న మహిళపై కత్తితో భయపెట్టి ఆమె మెడలో నుండి పుస్తెలతాడును తెంపుకొని చోరీకి పాల్పడుతుండగా ఈ దారి గుండా వెళుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి మహిళ అరుపులు విని కాన్వాయ్ ని ఆపి విషయం తెలుసుకొని పుస్తెలతాడు దొంగని అప్పగించిన సంఘటన నర్సాపూర్ సమీపంలోని బి.వి ఆర్ ఐ టి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేట సమీపంలోని సంఘ పేట గ్రామానికి చెందిన ఊ రడి సురేష్ తన సొంత ఆటలో భార్య స్వప్నతో కలిసి నర్సాపూర్ వస్తున్నట్టు తెలిపారు.

ఈ క్రమంలో ఇస్మాయిల్ ఖాన్ పేట వద్ద అమృత అనే ప్రయాణికురాలు వీరి ఆటోలో ఎక్కిందన్నారు. ఇలా వెళుతున్న క్రమంలో నర్సాపూర్ మండల పరిధిలోని ఆవంచ గ్రామ స్టేజి సమీపంలోకి రాగానే ఆటో పక్కకు నిలిపి ఆటో డ్రైవర్ సురేష్ కత్తి తీసి ఆటోలో ఒక్కరే ఉన్న మహిళ అమృతపై కత్తి చూపి భయపెట్టి పుస్తెలతాడు తెంపుకొని చోరీకి పాల్పడగా.. ఇదే దారిలో వెళుతున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి అరుపులు విని తమ కాన్వాయ్ ని ఆపి వివరాలు తెలుసుకొని పుస్తెలతాడు తెంపుకొని పరారవుతున్న ఆటో డ్రైవర్ సురేష్ అనే దొంగను ఆమె భద్రత సిబ్బంది పట్టుకున్నారు. ఈ విషయాన్ని నర్సాపూర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించి పుస్తెలతాడు దొంగలించే యత్నం చేసిన ఆటో డ్రైవర్ సురేష్, అతని భార్య స్వప్నను పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. వివరాలన్నీ తెలుసుకున్న ఎస్ఐ శివకుమార్ వస్తువును స్వాధీనం చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement