Wednesday, May 22, 2024

Kamareddy: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

కామారెడ్డి : కామారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం పెద్ద ఎక్లార బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న డి.వసుధ (16) వసతి గృహంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని స్వగ్రామం బిచ్కుంద మండలం మానేపూర్ గ్రామం. అయితే విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement