Monday, April 29, 2024

TS : పరీక్ష భయంతో… విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌…

పరీక్ష భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం తెల్ల‌వారు జామున‌ ఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్ప్రింగ్ కాలనీలో ఉండే జైస్వాల్ (20) నీట్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నాడు.

- Advertisement -

ఈ క్రమంలో ఎగ్జామ్ పై ఆందోళనకు గురైన విద్యార్థి ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి సూసైడ్ లెటర్ కూడా రాసినట్లు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాన్ని గాంధీ తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement