Sunday, April 28, 2024

TS : రాజ్యాంగ నిర్మాతకు జాగీర్ లో జేజేలు..

మణికొండ, ఏప్రిల్ 14(ప్రభ న్యూస్): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ కమిషనర్ బి.శరత్ చంద్ర ఘనంగా కొనియాడారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం నగరపాలక సంస్థ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -

ప్రపంచంలో భారత దేశం ఈరోజు ఇలా ఉన్నదంటే దానికి అంబేడ్కర్ రచించిన రాజ్యాంగమే కారణమని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబా సాహెబ్ తన జీవితాన్ని ధారపోశారని కీర్తించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ మేనేజర్ మంజులత, జేఏవో కృష్ణయ్య, ఏఈఈ రాజ్ కుమార్, శానిటరీ ఇన్ స్పెక్టర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, బిల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement