Sunday, April 28, 2024

TS : హైదరాబాద్​లో ఎస్‌వోటీ దాడులు…

హైద‌రాబాద్‌లో పలుచోట్ల సైబ‌రాబాద్ ఎస్‌వోటీ పోలీసులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ దగ్గర లా చదువుతున్న ఓ విద్యార్థి దగ్గర 5 ఎల్ఎస్‌డీ మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీనగర్, సిద్ధిక్ నగర్ లో 4 కేజీకి పైగా గంజాయిని పట్టుకున్నారు.

- Advertisement -

ఒరిస్సాకు చెందిన గగన్ కుమార్ బెహరా, కుషాల్ ప్రధాన్ ,మితునా థాయ్ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రాజేంద్రనగర్ అత్తాపూర్ డీ మార్ట్ సర్వీస్ రోడ్ లో ఆటోలో గంజాయి పెట్టుకుని అమ్ముతున్న యువకుడిని పట్టకున్నారు అత్తాపూర్ పోలీసులు. నిందితుడి దగ్గన నుండి 210 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement