Sunday, April 28, 2024

TS : కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం… కేటీఆర్ ట్వీట్‌…

చేరిపెస్తే చెరగని సత్యం కేసిఆర్ సాధించిన ఆర్థిక ప్రగతి అని కేటీఆర్ ట్వీట్ట‌ర్ వేదిక‌గా పేర్కొన్నారు. కేసీఆర్ ఆదివారం ఎండిన పంటల పరిశీలన కోసం మూడు జిల్లాల్లో పర్యటించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఈ సందర్భంగా గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కేసీఆర్ ఏం చేశారు అనే వారికి కౌంటర్ ఇచ్చారు.

కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారని.. తలసరి ఆదాయంలో పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమంగా ఉందన్నారు. రూ.3.09 లక్షల తలసరి ఆదాయంతో అగ్రస్థానంలో ఉన్నామని తెలిపారు. కేసీఆర్ సాధించిన ప్రగతి చెరిపినా చెరగని సత్యం అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు ఆయా రాష్ట్రాల పర్ క్యాపిటాకు సంబంధించిన ఫోటోను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జత చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement