Sunday, April 28, 2024

కుత్బుల్లాపూర్ లో బీజేపీ జెండా ఎగ‌ర‌డం ఖాయ‌మ‌న్న శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలో భారతీయ పార్టీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. నియోజకవర్గంలోని సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని సాయిబాబా నగర్ ముత్యాల బస్తి, సంతోష్ నగర్ బస్తీల్లో కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. వారి సమస్యలను అడిగి తెలుసున్నారు. అనంతరం ముఖ్య నాయకులతో సమావేశమై భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పలు విషయాలను చర్చించారు. బూత్ స్థాయిలో పార్టీని పటిష్టం చేసి…ప్రజల ఇబ్బందులు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించారు. ఇకపై నియోజకవర్గం మొత్తం ఎలాంటి సమస్యలున్నా… తన దృష్టికి తీసుకురావాలని కూన శ్రీశైలం గౌడ్ కోరారు. నిత్యం ప్రజలకు సేవ చేయడానికే భారతీయ జనతా పార్టీ నాయకులు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement