Sunday, April 28, 2024

DGP: గంజాయి, డ్రగ్స్‌ రాకుండా ప్రత్యేక నిఘా… డీజీపీ రవిగుప్తా

ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్‌ రాకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని పోలీసుల‌కు డీజీపీ రవిగుప్తా సూచించారు.రాష్ట్రంలో డ్రగ్స్‌ నిర్మూలనపై డీజీపీ రవి గుప్తా శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని డీజీపీ రవిగుప్తా ఆదేశించారు. నార్కోటిక్‌ బ్యూరో అధికారులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. డ్రగ్స్‌ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ సందర్భంగా అలర్ట్‌గా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement