Friday, May 3, 2024

19న దేవాలయాలకు ప్రత్యేక బస్సులు : డీఎం లక్ష్మి ధర్మ

జనగామ : కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న దేవాలయాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు జనగాం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్ లక్ష్మి ధర్మ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… కార్తీక పౌర్ణమి పర్వదినమును పురస్కరంచుకుని జనగామ బస్టాండ్ నుంచి ప్రముఖ దేవస్థానములైన‌ పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర దేవాలయం, కొమురవెల్లి మండల కేంద్రంలోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంనకు ప్రత్యేక బస్సులు ప్రతి 30 నిమిషములకు ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని, స్వామివారి ఆశీస్సులు పొందగలరని ఆర్టీసి జనగాం డిపో మేనేజర్ ఎన్ లక్ష్మిధర్మ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement