Friday, May 3, 2024

Smuggling – హైదరాబాద్ లో రూ.కోటి విలువైన గంజాయి పట్టివేత… ముగ్గురు అరెస్ట్

హైద‌రాబాద్ – తెలంగాణ మీదుగా ఏపీ నుంచి యూపీ గంజాయి స్మగ్లింగ్ ముఠాకు హైదరాబాద్ పోలీసులు బ్రేక్ వేసి.. షాక్ ఇచ్చారు. రాచకొండ సీపీ సుదీర్ బాబు సమాచారం మేరకు, రాచకొండ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ ముఠా ను ఎల్ బీనగర్ స్పెషల్ ఆపరేషన్ టీమ్ బృందం అరెస్ట్ చేసి రూ. కోటి విలువైన 360 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుంది. వాహనాల తనిఖీల్లో రాజమండ్రి నుంచి హైదరాబాద్ మీదుగా ఉత్తర ప్రదేశ్ కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను ఎస్ ఓ టీ అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

వాహనాల్లో గంజాయి ని తరలిస్తున్న సమయంలో ఒక పైలెట్ వాహనం తో వెళ్తారు. పోలీసులను గమనించి సరుకును దారి మళ్లిస్తారు. ఈ కేసులో యూపీ కి చెందిన వికాస్, అబ్రర్, అమిరుద్దీన్ లను అరెస్ట్ చేసి నాలుగు మొబైల్స్, ఒక కారు స్వాధీనం చేసుకున్నామని, డ్రగ్స్, గంజాయి రవాణాపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాదక ద్రవ్యాల పై స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తున్నామని, డ్రగ్స్, గంజాయి సరఫరా చేసినా, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement