Monday, April 29, 2024

Breking : కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ లో మంటలు.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

సికింద్రాబాద్ నుంచి కాగజ్ నగర్ వైపు వెళ్తున్న సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ స్టేషన్ వద్దకు రైలు రాగానే మంటలు వ్యాపించాయి.

ఒక్కసారిగా బోగిల్లో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన లోకో పైలట్ రైలు నిలిపివేయగా.. ప్రయాణికులు కిందకు దిగిపోయారు. అనంతరం మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ఘోర ప్రమాదం తప్పింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement