Thursday, May 2, 2024

Siricilla – ఎసీబీ వలలో అవినీతి చేప – లంచం తీసుకుంటూ చిక్కిన జిల్లా పరిశ్రమల శాఖ జీఎం ఉపేందర్

సిరిసిల్ల, అక్టోబర్ 30 (ప్రభన్యూస్) : అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేప చిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు రూ. 13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జిల్లాలోని వీర్ణపెల్లి మండలం అడవి పదిర గ్రామానికి చెందిన భూక్యా సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ కు దరఖాస్తు చేసుకోగా, సబ్సిడీ మంజూరీ కోసం సరితకు అనుకూలంగా పంపడానికి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు.

. దీనితో రూ.17వేలు ఈనెల 26న తీసుకోగా, సోమవారం మిగతా 13 వేల రూపాయలను సరిత మరిది భూక్య శివకుమార్ వద్ద నుండి సిరిసిల్ల పట్టణంలోని గీత నగర్ జడ్పీ హై స్కూల్ లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ సంఘటనలో కేసు నమోదు చేసి, జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు ను ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డిఎస్పీ వి.వి రమణమూర్తి తెలిపారు. ఏ అధికారైన అవినీతికి పాల్పడితే 9154388954 సంప్రదించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement