Monday, April 29, 2024

TS: ఏషియన్ షూటింగ్ పోటీల్లో భారత్ కు వెండి పతకం… ప్రతిభ కనబరిచిన మేఘన

దక్షిణ కొరియాలో జరుగుతున్న 15వ ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ వెండి పతకం సాధించింది. శనివారం దక్షిణ కొరియాలోని షాన్గ్వాన్ లో నిర్వహించిన ఏషియన్ షూటింగ్ ఛాంపియన్షిప్ 25మీటర్ల పిస్టల్ మహిళల విభాగంలో భారత్ టీం సిల్వర్ సాధించింది. భారత టీమ్ లో తెలంగాణకు చెందిన మేఘనా సాదుల, హర్యానాకు చెందిన సిమ్రాన్, పంజా కు చెందిన తేజస్వినీలు ప్రాతినిధ్యం వహించారు.

ఈనెల 21నుండి 31వరకు షూటింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. గతంలో జర్మనీలో జరిగిన పోటీల్లో భారత్ టీం గోల్డ్ సాధించిన విషయం విధితమే. ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భారత్ వెండి పతకం సాధించడం పట్ల ఇండియన్ షూటింగ్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మేఘన సాధుల ప్రతిభ కనబరచడం పట్ల ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ అభినందనలు తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement