Saturday, May 18, 2024

జవాబుదారితనంతో పని చేయాలి.. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: సాయి చంద్

పెద్దపల్లి (ప్రభా న్యూస్) : ప్రభుత్వ ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయి చంద్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని గోదాములను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బియ్యం నిల్వలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. హమాలీలతో మాట్లాడి సమస్యలపై మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కటిన చర్యలు తీసుకుంటామని, సిబ్బంది పనితీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అనంతరం గోదాముల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎం వెంకటేశ్వర్లు, మేనేజర్ మహేందర్రెడ్డి, సాభిర్ ఆలి, రమేష్, ప్రసాద్ తో పాటు పలువురు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement