Saturday, May 18, 2024

ఘనంగా శివాజీ శోభాయాత్ర.. పాల్గొన్న పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

ఛ‌త్రపతి శివాజీ శోభాయాత్ర పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం స్థానిక అమర్ నగర్ చౌరస్తాలో శోభాయాత్రను పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ధర్మ సంస్థాపనార్థం శివాజీ మహారాజ్ సామ్రాజ్యాన్ని స్థాపించారన్నారు.

పట్టాభిషేకం జరిగిన రోజును పురస్కరించుకుని చత్రపతి శివాజీ యువసేన ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్​ మాజీ చైర్మన్ చిరుమళ్ల‌ రాకేష్, రాజేష్, సతీష్, పిన్నింటి రాజుతో పాటు పెద్ద సంఖ్యలో యువకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement