Monday, April 29, 2024

Shabbir Ali – బీడీ కార్మికుల సంకేమమే కాంగ్రెస్ ధ్యేయం

.నిజామాబాద్ సిటీ, నవంబర్ (ప్రభ న్యూస్)24:బీడీ కార్మికుల సంకేమమే కాంగ్రెస్ ధ్యేయమని నిజామా బాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికా రంలోకి రాగానే బీడీ కార్మికులను ఆదు కొని వారి కి ఆరోగ్య భద్రత కల్పించి వారి కుటుంబాలను ఆదుకుంటామన్నారు. మాది ఒకటే డిమాండ్ బీడీ పరిశ్ర మను రద్దు చేస్తే దానికి రెండిం తలు ఆదా యం వచ్చే భరోసా కల్పించి న తరువాతే ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నారు.శుక్రవారం నిజామాబాద్ పట్టణంలోని మారుతి నగర్ లో నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ మ్మద్ అలీ షబ్బీర్ బీడీ కార్మి కులతో సమావేశమై వారి మద్ద తు కోరారు

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్యేయమని నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీ అన్నారు. శుక్రవారంనిజామాబాద్ పట్టణం వినా యక నగర్ లోని మున్నూరు కాపు సంఘంలో పట్టణ గౌడ సంఘం సభ్యులతో నిజామా బాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మహమ్మద్ అలీ షబ్బీర్ ఆత్మీయ సమ్మే ళనం లో పాల్గొని వారి మద్దతు కోరారు.ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గౌడ్ అన్నలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్న దన్నారు.కెసిఆర్ ప్రభుత్వం గ్రామ గ్రామాన బెల్ట్ షాపులు చీప్ లిక్కర్ తీసుకువచ్చి మీ కడుపు కొట్టిం ది పేద ప్రజలను తాగు డుకు బానిస చేసి వారి ఉసురుతీసిం దని వాపోయారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాగానేచెట్టు పన్ను రద్దు, సొసైటీ పునరుద్దరణ, ఆటోమేటిక్ రెన్యువల్ పకడ్బందీగా అమ లు అయ్యేలా చేస్తామని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement