Sunday, April 28, 2024

Scrutiny : నేడు నామినేష‌న్‌ల ప‌రిశీల‌న

ఇవాళఅసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి వివిధ పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పరిశీలన చేయనున్నారు. మొత్తం 119 నియోజకవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు పరిశీలించనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈ మొత్తం నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని అధికారులు తిరస్కరించనున్నారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఈ నెల 15 వరకు ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement