Sunday, April 28, 2024

Sangareddy – హస్తం గూటికి సంగారెడ్డి బీజేపీ ఇంచార్జ్ పులి మామిడి రాజు

సంగారెడ్డి – ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్ లో గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి పులి మామిడి రాజు హస్తం గూటికి చేరారు. ఈ మేరకు ఆయన శనివారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ తో కలిసి చేరుకున్నారు.

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పులి మామిడి రాజుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు ఆకర్షితులై పార్టీలోకి వచ్చేవారికి వెల్కమ్ చెబుతుందన్నారు. బిజెపి నుంచి కాంగ్రెస్ లో చేరిన పులి మామిడి రాజును సీఎం అభినందించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement