Sunday, May 19, 2024

Sai Krishna – అప్సరతో శారీరిక సంబంధం లేదంటే లేదు….అంతే..

హైద‌రాబాద్ – అప్సర హత్య కేసులో నిందితుడు పూజారి సాయికృష్ణ అరెస్ట్‌ తర్వాత శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. ఆవేశంలో అప్సరసను చంపేశాడని కన్నీళ్లు పెట్టుకున్నాడు… అప్సర అదృశ్యం కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా సాయికృష్ణను పిలిపించి విచారించారు. సీసీటీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతడే హంతకుడిగా గుర్తించారు. ఈ క్రమంలో శంషాబాద్ పోలీసులు పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించారు. సాక్ష్యాధారాలతో పట్టుబడిన తర్వాత నేరాన్ని అంగీకరించాడు.

అస‌లు విషయం తెలిస్తే పరువు పోతుందని సాయికృష్ణ భావించి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో వీరంగం సృష్టించింది. ఆవేశంలో హత్య చేశానని, కుటుంబం ఏమవుతుందోనని గ్రహించి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. తనకు బతకడం ఇష్టం లేదని పదే పదే చెప్పాడు. జైలులో పెట్టినా.. ఎప్పుడో ఆత్మహత్య చేసుకుంటానని పోలీసులు చెబుతున్నారని, కుటుంబసభ్యులకు ముఖం చూపించలేనని బోరున విలపించాడు. ఏడుస్తూనే హత్యకు దారితీసిన పరిస్థితులను చెప్పినట్లు పోలీసుల నుంచి అందిన సమాచారం. సాయికృష్ణ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడంతో పోలీసులు భయాందోళనకు గురయ్యారు. ఏదైనా జరిగితే సమస్య వస్తుందని రాత్రి సాయికృష్ణను న్యాయమూర్తి ఎదుట తీసుకెళ్లారు. సాయికృష్ణకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం చర్లపల్లి జైలుకు తరలించారు.

ఇక సాయి పోలీసులతో మాట్లాడుతూ, అప్సర తనను తీవ్రంగా వేధించిందని చెప్పాడు. రెండో పెళ్లి చేసుకోకుంటే పరువు పోతుందని హెచ్చరించాన‌ని వివరించారు. అంతే కాకుండా ఇద్దరు కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బ్లాక్ మెయిల్ కూడా చేసిందని చెప్పాడు. ఆ ఏరియాలో తనకు మంచి పేరు ఉందని తెలిస్తే తన పరువు పోతుందని సాయికృష్ణ భావించారు. అందుకే ఆమెను చంపేశానని చెప్పాడు. అప్సర గర్భం దాల్చిందని,ఆ పేరుతో తనపై మరింత ఒత్తిడి పెంచిందని సాయికృష్ణ చెబుతున్నాడు. అయితే త‌న‌కు,అప్స‌ర‌కు శారీరిక సంబంధం లేనే లేద‌ని చెప్పాడు..ఆమెకు చెన్నైకు చెందిన యువ‌కుడితో స‌న్నిహిత సంబంధం ఉంద‌ని,అలాగే 10 మందికి పైగా ఆమెకు బోయ్ ఫ్రెండ్స్ ఉన్నార‌ని పోలీసుల దృష్టికి తెచ్చాడు.. అందుకే ఆ ప్రెగ్నెన్సీతో తనకు సంబంధం లేదని చెప్పాడు. పెళ్లి అయిన త‌న‌ను ఆమె పెళ్లి చేసుకోవాల‌ని గ‌త కొన్ని నెలులుగా ఒత్తిడి చేస్తుండటంతో , ఏమిచేయాలో అర్ధంకాక డిప్రెష‌న్ తో అప్ప‌ర‌ను హ‌త్య చేశాన‌ని ఒప్పుకున్నాడు..

అంబ‌ర్ పేట శ్మ‌శాన వాటిక‌లో అప్ప‌ర అంత్య‌క్రియ‌లు
హ‌త్య‌కు గురైన అప్ప‌ర మృత‌దేహాన్ని నేడు ఉస్మానియాలో పోస్ట్ మార్ట‌మ్ నిర్వ‌హించారు.. అనంత‌రం ఆమె బౌతిక‌కాయాన్ని బంధువుల‌కు అప్ప‌గించారు.. సంప్ర‌దాయబ‌ద్దంగా ఆమె అంత్యక్రియ‌ల‌ను అంబ‌ర్ పేట శ్మ‌శాన వాటిక‌లో నిర్వ‌హించారు.. ఇది ఇలా ఉంటే ప్రాధ‌మిక పోస్ట్ మార్ట‌మ్ నివేదిక ప్ర‌కారం త‌ల‌కు బ‌ల‌మైన గాయాలు త‌గ‌డం వ‌ల్లే మ‌ర‌ణించిన‌ట్లు తేలింది.. అలాగే ఆమె గర్భవతి కాదని కూడా వైద్యులు దృవీకరించారు. ఇంకా పూర్తి స్థాయి నివేదిక అందాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement