Tuesday, April 30, 2024

TS : శ‌భాష్ మ‌ధు….భారీ జ‌న స‌మీక‌ర‌ణ చేశావు… సీఎం రేవంత్ కితాబు..

తుక్కుగూడ జనజాతర సభ విజయవంతం అయ్యింద‌ని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ పార్లమెంట్ తరపున భారీగా జన సమీకరణ చేసి సభను సక్సెస్ చేశారని నీలం మ‌ధును సీఎం రేవంత్ అభినందించారు. సభ సూపర్ సక్సెస్ అయిన సందర్భంగా.. ఆదివారం మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, జిల్లా ఇంచార్జ్ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు.

- Advertisement -

సభ విజయవంతానికి కలిసి పనిచేసిన నీలం మధును ముఖ్యమంత్రి రేవంత్ అభినందించారు. ఇదే స్పూర్తితో రాబోయే ఎన్నికల్లోనూ ప్రజలలోకి వెళ్లాలని సూచించారు. అందరిని కలుపుకుని ఐక్యంగా ముందుకెళ్లి మెదక్‌ పార్లమెంట్‌లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement