Wednesday, March 27, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (మార్చ్ 23) ప్రభా న్యూస్ – గ్రూప్ వన్ పేపర్ లీకేజీ దేశద్రోహం కన్నా దారుణమైన విషయం అని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆరెస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అయినా మాట్లాడుతూ గ్రూప్ వన్ పరిక్షల పేపర్ లీకేజీ వ్యవహారం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్ వన్ పేపర్ లీకేజీ ధనిక పిల్లలు ఉన్నత ఉద్యోగులు కట్టబెట్టే దిగు చేస్తున్న కుట్రని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ పునర్నిర్మాణం 5వ ఉద్యమం చేయాలని అందుకు బడుగు బలహీన ధనిక పేదలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి సంబంధం ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయని అన్నారు. గ్రూప్ వన్ కేజీ పై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement