Sunday, April 28, 2024

రోశయ్య మృతి బాధాక‌రం : దేవేంద‌ర్ గౌడ్

మాజీ గవర్నర్, మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి బాధాకరమని మాజీ హోంశాఖామంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. తెలుగునాట రోశయ్య ఓ అసాధారణమైన రాజకీయ నాయకుడని, చేపట్టిన అన్ని పదవులకు గౌరవాన్ని పెంపొందించిన వ్యక్తి అని పేర్కొన్నారు. ఆర్థికమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తనదైన ముద్ర వేశారని, ప్రజల సొమ్ముకు ధర్మకర్తగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరాన్ని ప్రతి సందర్భంలోనూ పదేపదే గుర్తు చేసేవారని దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా… ప్రతిపక్షంలో ఉన్నా ఎంతో హుందాగా వ్యవహరించేవారని, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో కలిసిపోయేవారని.. ఆ విధంగా ప్రజా జీవితంలో ఆదర్శప్రాయంగా నిలిచారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా తనకు కె.రోశయ్యతో ఎంతో అనుబంధం ఉందని, తనని అభిమానించేవారని గుర్తు చేసుకొన్నారు. తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా ఉన్నప్పుడు తన శాసనసభ ప్రసంగాల పుస్తకాల ఆవిష్కరణ సభకు ముఖ్య అతిధిగా.. హైదరాబాద్ వచ్చి పుస్తకాలను ఆవిష్కరించారని గుర్తు చేసుకొన్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు టి.దేవేందర్ గౌడ్ తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement