Saturday, May 11, 2024

Road accident: వనస్థలిపురంలో రోడ్డు ప్ర‌మాదం… ఇద్ద‌రు యువ‌కుల మృతి…

మితిమీరిన వేగంతో అదుపుతప్పిన ఓ టిప్పర్ విధ్వంసం సృష్టించింది. ఓ బైక్ ను వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోయారు. ఈఘ‌ట‌న వ‌న‌స్థ‌లిపురంలో ఇవాళ తెల్ల‌వారు జామునా చోటుచేసుకుంది.

కూకట్ పల్లికి చెందిన సతీశ్, వీరబాబు వనస్థలిపురంలో ఇటుక లోడ్ ఖాళీ చేయడానికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా సుష్మా థియేటర్ సమీపంలో ఓ టిప్పర్ వీరి బైక్ ను ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు యువకులు ఇద్దరూ ఎగిరిపడగా.. టిప్పర్ ముందు టైర్లు బైక్ పైకెక్కాయి. దీంతో తీవ్రగాయాలపాలైన సతీశ్, వీరబాబు స్పాట్ లోనే కన్నుమూశారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement